బాలీవుడ్ మీడియా హడావుడి చేస్తున్నంత రెమ్యూనరేషన్ లేదట

  • August 21, 2019 / 12:41 PM IST

సాహో సినిమా కోసం బాలీవుడ్ కథానాయకి శ్రద్ధకపూర్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారని.. ఆమె దాదాపు 7 కోట్ల రూపాయల పారితోషికం అందుకొందని.. బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమెకు ఇప్పటివరకు అంత ఇవ్వలేదని బాలీవుడ్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. “సాహో” సినిమా బడ్జెట్ కూడా 350 కోట్లు కావడంతో.. 7 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదని అనుకొన్నారు.

కానీ.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. “సాహో” సినిమా కోసం కథానాయికగా శ్రద్ధకపూర్ పుచ్చుకొన్న మొత్తం 3 కోట్లు మాత్రమే. మన టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్, నయనతారలు కూడా కోటిన్నర దాకా తీసుకొంటారు. అందువల్ల శ్రద్ధకపూర్ కి మూడు కోట్లు పే చేయడం అది కూడా ఒకేసారి మూడు భాషల్లో షూట్ చేయబడిన సినిమాకి ఎక్కువేమీ కాదు. మరో 9 రోజుల్లో విడుదలవ్వనున్న ‘సాహో” సినిమాతో శ్రద్ధకపూర్ కెరీర్ టాలీవుడ్ లో ఎలా ఉండబోతోంది అనేది తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus