సోషల్ మీడియాలో శ్వేతా బసు ప్రసాద్ భావోద్వేగ పోస్ట్!

  • November 3, 2017 / 01:47 PM IST

ఒకే ఒక్క సినిమాతో శ్వేతా బసు ప్రసాద్ యువత గుండెల్లో చేరిపోయింది. “కొత్త బంగారులోకం” సినిమాలో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ సినీ జనాలను తనవైపు తిప్పుకుంది. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ అయిపోతుందనుకునేలోపే.. ఓ తప్పిదం శ్వేతా బసు కెరీర్ మొత్తాన్ని కుప్పకూలిపోయేలా చేసింది. మళ్ళీ కొని సినిమాలో నటించినప్పటికీ పూర్వ వైభవం సొంతం చేసుకోలేక పోయింది. దీంతో బుల్లి తెరపై అడుగుపెట్టింది. హిందీలో “చంద్ర నందిని” అనే టీవీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్‌ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ షూటింగ్ నిన్నటితో ముగిసిపోవడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టింది. “ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది.

Click Here For Review

అలాగే చంద్ర నందిని కూడా ముగిసింది. నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత బాధగా ఉందో చెప్పడానికి మాటలు రావడంలేదు. ఈ సీరియల్‌ లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్‌ కి ధన్యవాదాలు. రేపటి నుంచి చిత్రీకరణ కోసం స్టూడియోకి వెళ్లే పనిలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది” అంటూ సీరియల్ లో నటించిన ఫోటోను పోస్టు చేసింది. ఈ పోస్ట్ కి చాలా మంది ఆమె అభిమానులు వియ్ మిస్ మహారాణి నందిని అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus