Siddarth: సిద్దార్థ్ కామెంట్స్ పై నెటిజన్ల రియాక్షన్ వైరల్.. ఏం జరిగిందంటే?

  • April 15, 2024 / 01:13 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరో సిద్దార్థ్ కు మంచి పేరు ఉంది. సిద్దార్థ్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే. సిద్దార్థ్ తన మనస్సులో ఉండే అభిప్రాయాలను వ్యక్తపరచడంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక అవార్డుల కార్యక్రమంలో సిద్దార్థ్ (Siddharth)  చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నా సినిమాను చూడటం కష్టమని ఒక్క మహిళ కూడా నాతో కానీ దర్శకుడితో కానీ చెప్పలేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

అయితే మగవాళ్లు మాత్రం చాలామంది ఈ సినిమా చూసి తట్టుకోవడం కష్టమని కామెంట్ చేశారని సిద్దార్థ్ అభిప్రాయపడ్డారు. తమ సినిమా విషయంలో ఎవరైతే నెగిటివ్ కామెంట్లు చేశారో వాళ్లు మృగం సినిమాను మాత్రం చూస్తారని సిద్దార్థ్ అన్నారు. యానిమల్ (Animal)  సినిమా గురించి పరోక్షంగా సిద్దార్థ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. కానీ అలాంటి వాళ్లను తన సినిమా మాత్రం డిస్టర్బింగ్ గా ఉంటుందని సిద్దార్థ్ పేర్కొన్నారు.

త్వరలోనే సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకుల ఒపీనియన్ మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరి సినిమా వాళ్లకు గొప్ప సినిమా అని అనిపిస్తుందని అంత మాత్రాన విమర్శలు చేయడం సరికాదని నెటిజన్లు చెబుతున్నారు. సిద్దార్థ్ కామెంట్ల గురించి యానిమల్ మూవీ టీం ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాల్సి ఉంది. యానిమల్ సినిమాపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

సిద్దార్థ్ చేసిన కామెంట్లు నిజమేనని కొంతమంది చెబుతుండగా ఆ కామెంట్లను మరి కొందరు విమర్శిస్తున్నారు. సిద్దార్థ్ కెరీర్ లో కూడా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయని ఆ సినిమాలపై కూడా ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారాలే తప్ప హిట్టైన సినిమాల గురించి విమర్శలు చేయడం సరికాదని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus