ఆ బడా నిర్మాతలు ఈసారి బాలీవుడ్ పై పడ్డారు..!

  • June 23, 2021 / 09:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తూనే మరోపక్క తర్వాత చేయబోయే ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు. 65 ఏళ్ల వయసులో కూడా ఈయన స్పీడు చూసి…తోటి స్టార్ హీరోలు,యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు.’ఆచార్య’ పూర్తయిన వెంటనే మోహన్ రాజా డైరెక్షన్ లో ‘లూసిఫర్’ రీమేక్ లో నటించబోతున్నారు మెగాస్టార్. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది.

ఇక ఈ చిత్రం పూర్తయ్యాక మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘వేదాలం’ రీమేక్ లో చిరు నటిస్తారని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు బాబీ మూవీ సెట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్టు గతేడాదే చిరు అనౌన్స్ చేశారు. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మిచబోతున్నట్టు మాత్రం ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఎంపికైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇన్సైడ్ టాక్.

అయితే ఆమె దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఈ మధ్య కాలంలో మిగిలిన భాషల్లో స్టార్లుగా కొనసాగుతున్న వారిని టాలీవుడ్ కు పట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ‘మైత్రి’ వారు. ‘పుష్ప’ తో మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను, ‘అంటే సుందరానికి?’ చిత్రంతో నజ్రియా ని, అలాగే ఓ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను టాలీవుడ్ కు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వారి దృష్టి బాలీవుడ్ పై పడినట్టు స్పష్టమవుతుంది. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సోనాక్షి సిన్హా ని కూడా టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus