సతీసమేతంగా వైల్డ్ లైఫ్ టూర్ కి వెళ్లిన రాజమౌళి

  • September 17, 2020 / 10:20 PM IST

ఈ మధ్య దర్శకుడు రాజమౌళికి ఏమీ కలిసి రావడం లేదు. కెరీర్ లో మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ ఆయనను చిక్కున పెడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటినుండి వరుస ఇబ్బందులే. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ గాయాలపాలు కావడం, మధ్యలో హీరోయిన్ వెళ్లిపోవడం, తాజాగా లాక్ డౌన్, ఇలా వరుస ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ఒక ప్రక్క నిర్మాతల నుండి ఎన్టీఆర్, చరణ్ అభిమానుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న సమయాని కంటే ఏడాది లేటవగా, రాజమౌళికి ఏమి పాలుపోవడం లేదు.

షూటింగ్స్ కి అనుమతి దొరికిన పరిస్థితుల రీత్యా మొదలుపెట్టలేక పోతున్నారు. ఇవన్నీ కాదన్నట్లు ఈ మధ్య ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడింది. ఇంటిలోని కుటుంబ సభ్యులు అందరికి కరోనా సోకగా ఇంటిలోనే చికిత్స తీసుకున్నారు. దాదాపు రెండు వారాల ఐసొలేషన్ అనంతరం కోలుకోవడం జరిగింది. దీనితో ప్రశాంత కోసం రాజమౌళి సతీసమేతంగా ఓ టూర్ వేశారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సందర్శించారు.

అక్కడ వైల్డ్ లైఫ్ టూర్ కి కూడా రాజమౌళి, రమా వెళ్లారు. అలాగే దగ్గరలోని చామరజనగర్ హిమవద్ గోపాల స్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. రాజమౌళి, రమా కర్ణాటక టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ఫారెస్ట్ సిబ్బందితో కూడా ఈ స్టార్ కపుల్ ఫోటోలకు పోజిచ్చారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి రాజమౌళి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది.

1

2

3

4

5

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus