నన్ను చంపేస్తాను అని నా భర్త బెదిరిస్తున్నాjడు : సీనియర్ హీరోయిన్

  • April 29, 2020 / 07:22 PM IST

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు లతో ‘ప్రేమంటే ఇదేరా’ ‘రాజకుమారుడు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతీ జింటా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐపీయల్ మ్యాచ్ ల ద్వారా కూడా ఈమె మరింతగా పాపులర్ అయ్యింది.ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ తరువాత పారిశ్రామిక వేత్త నెస్ వాడియా ను డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు వీరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది.

పొలీస్ కంప్లైంట్ వరకూ వెళ్ళడం ఇప్పుడు వైరల్ గా కూడా మారింది. ఆమె మాట్లాడుతూ… “2014లో పంజాబ్ – చెన్నై మ్యాచ్ లో నా పట్ల నెస్ దురుసుగా ప్రవర్తించి టీం సభ్యుల ముందే తిట్టాడు. మొదట గొడవ అప్పుడే మొదలైంది. జట్టు మేనేజ్ మెంట్ విషయంలోనే మా మధ్య విభేదాలువచ్చాయి.. నెస్ నన్ను దారుణంగా తిట్టాడు. మానసికంగా క్షోభ పెట్టాడు. అంతేకాదు..నెస్ పలుకుబడితో నన్ను చంపేస్తాను అని హెచ్చరించాడు.

వాంఖడే ముంబై స్టేడియంలో నాకు వార్నింగ్ ఇచ్చాడు” అంటూ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు లేఖ రాసింది. తన ప్రాణాలకు నెస్ వల్ల ముప్పు ఉందని కూడా ఆ లేఖలో పేర్కొంది. అయితే ప్రీతీ జింటా ఆరోపణల్లో నిజం లేదు అంటూ’ కూడా నెస్ తెలిపాడు. మరి వీటిలో నిజమెంత.. ఎప్పుడు ఇవి పరిష్కారం అవుతాయి అనేది చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus