నేను పబ్లిక్ ఫిగర్ ని… హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.!

  • December 21, 2023 / 08:49 PM IST

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమంది హీరో, హీరోయిన్లకి అభిమానుల నుండి ఎంకరేజ్మెంట్ లభించదు. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అయితే ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యింది. ‘ఖో గయే హమ్ కహాన్ ‘ సినిమా ప్రమోషన్స్ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో అనన్య పాండే స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ విషయం పై అనన్య పాండే మాట్లాడుతూ.. “నేను ఒక పబ్లిక్ ఫిగర్ ని..! నా పేరెంట్స్ కి ఉన్న సినిమా బ్యాక్ గ్రౌండ్ వల్లే నేను ఈ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో నా కెరీర్ ప్రారంభించాను. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నా ఫర్మార్మెన్స్ అందరికీ నచ్చేలా ఉంటుంది.అంతా ప్రశంశించారు కూడా.! కానీ ఆ టైంలో మా ఫ్యామిలీకి ఉన్న అభిమానులు నా పై ప్రేమ చూపించలేదు.

ఇప్పటికీ నన్ను ఆందోళనకు గురి చేసేది అదే. చుంకీ పాండే నుండి వచ్చిన వారసత్వం, గౌరవం పొందాలనుకున్న నాకు అభిమానులు మాత్రం అండగా నిలబడలేదు. దీంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. నేను ఊహించుకున్న ప్రపంచం తలకిందులు కావడంతో వెక్కి వెక్కి ఏడవాలనిపించింది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్ కు అభిమానుల నుండి ఎంకరేజ్మెంట్ గట్టిగానే ఉంటుంది.అందుకే నెపోటిజం ఎక్కువగా ఉన్న సినీ పరిశ్రమగా బాలీవుడ్ నిలుస్తుంది. మరి అనన్య పాండే (Ananya Panday) విషయంలో ఎందుకు అలా జరిగిందో

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus