విమర్శలపై మండిపడ్డ ప్రభాస్ హీరోయిన్!

  • January 18, 2022 / 10:58 AM IST

మన తారలు పబ్లిక్ ఫిగర్లని నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ప్రతీ హీరోయిన్ ఏదొక సమయంలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొనే ఉంటారు. కీర్తి సురేష్ మొదట్లో కాస్త బొద్దుగా ఉందని అనేవారు. దీంతో ఆమె బాగా సన్నబడింది. తీరా సన్నబడ్డాక మునుపటి లుక్కే బావుందని కామెంట్స్ చేశారు. ఇలా బరువు, నడక, నవ్వు చాలా విషయాల్లో హీరోయిన్లకు సలహాలు ఇస్తుంటారు. నటి కృతిసనన్ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది.

తెలుగులో మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించింది. ఆ తరువాత ‘దోచేయ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడే అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో వరుస ఛాన్స్ లు దక్కించుకుంది. అలానే హిట్లు కూడా అందుకుంది. దీంతో ఆమె డిమాండ్ పెరిగిపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ బాడీ షేమింగ్ గురించి మాట్లాడింది.

చాలా మంది తన నవ్వుపై కామెంట్స్ చేసేవారని చెప్పింది. ‘గమ్మీ స్మైల్’ అని.. పెదాలు లావుగా అయ్యేలా సర్జరీ చేయించుకోమని చెప్పేవారని తెలిపింది. నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా? నా నవ్వు అంతే అంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్. కొంతమంది తన నడుము సైజ్ తగ్గాలని చెప్పారని.. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్ట‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత‌ ఈ ప్రెజర్మరింత ఎక్కువైందని తెలిపింది. ప్రతి ఒక్కరి మాటలు వినాల్సిన అవసరం.. పట్టించుకోవాల్సిన పని లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంది. అలానే ‘బచ్చన్ పాండే’, ‘భేడియా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus