ఐశ్వర్య రాజేష్ ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్..!

  • May 26, 2020 / 07:13 PM IST

రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావు లు జంటగా నటించిన ‘రాంబంటు’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఆ చిత్రంలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ప్రముఖ సీనియర్ కమెడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీలక్ష్మికి ఈమె దగ్గర బంధువు. తరువాత ఆమె తమిళ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ఇక మళ్ళీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ ఏడాది వచ్చిన విజయ్ దేవరకొండ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాకి ఏమైనా హైలెట్ ఉందా అంటే.. అది ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ పాత్ర అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. మీటూ అంటూ ఎంతో మంది నటీమణులు.. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసింది.

ఈమె మాట్లాడుతూ.. ” సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులను అలాగే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. నేను నల్లగా ఉన్నాను అని చాలా మంది హేళన చేసేవారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని.. కనీసం కమెడియన్ పక్కన కూడా నేను సెట్ అవ్వనని ఓ స్టార్ డైరెక్టర్ అవమానించాడు. కానీ నేను అవేమీలెక్కలోకి తీసుకోలేదు.. ఎన్నో వేధింపులను ఎదుర్కొనే పైకి వచ్చాను” అంటూ ఐశ్వర్య రాజేష్ తెలిపింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus