Chiranjeevi: టాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాల్సిందే.. హీరోల సైలెన్స్ వల్ల నష్టమేనా?

  • September 24, 2024 / 07:09 PM IST

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi)   ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఆరు పదుల వయస్సులో సైతం అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. 537 పాటలు, 24 వేల స్టెప్పులతో మెగాస్టార్ ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించారనే చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి గిన్నిస్ రికార్డ్ గురించి పలువురు మెగా హీరోలు ఇప్పటికే స్పందించారు. అయితే ఇతర ఫ్యామిలీల స్టార్ హీరోల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన అయితే రాలేదనే చెప్పాలి.

Chiranjeevi

హీరోల సైలెన్స్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితులు మారుతున్నాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేస్తే నష్టం ఏంటనే నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. గిన్నిస్ రికార్డ్ సాధించడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ వైఖరి విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టైర్1 హీరోలు చిరంజీవి ఘనత విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.

చిరంజీవి రికార్డ్ కు సంబంధించి ఏదైనా ఈవెంట్ ను కండక్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవికి ఇండస్ట్రీలో అందరివాడుగా పేరుంది. ఆయన ఇండస్ట్రీలో అందరి మంచి కోరుతారు. టాలెంట్ తో ఎవరైనా ఎదిగితే వాళ్లను అభినందించే విషయంలో సైతం చిరంజీవి ముందువరసలో ఉంటారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)  సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

చిరంజీవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మెగాస్టార్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో పాటు తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

రెండు సార్లు చేతులు మారిన విశ్వక్ సేన్ సినిమా.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus