ఆ మాటలు చిరాకు తెప్పించాయి : తమన్నా

  • November 9, 2020 / 07:01 PM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సామాన్యులకు, సెలబ్రిటీలకు దూరం తగ్గింది. సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటున్నారు సెలబ్రిటీలు. అయితే కొన్ని సార్లు నెటిజన్ల కారణంగా సెలబ్రిటీలు ఇబ్బందిపడ్డ రోజులు ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఈ విషయంపై మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయింది. ఇటీవల తమన్నా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఆమె తాజాగా కోవిడ్ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి,

ఆ తరువాత తన ఫోటోలను చూసి నెటిజన్లు రియాక్ట్ అయిన విషయాల గురించి వివరించింది. తనకు కరోనా సోకిందనే విషయం తెలిసినప్పుడు కంగారు పడ్డానని.. కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో చనిపోతానేమోనని భయపడినట్లు తమన్నా చెప్పింది. ఆ సమయంలో డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తనను కాపాడారని వెల్లడించింది. ఆ సమయంలోనే తనకు జీవితం విలువ తెలిసిందని చెప్పింది. అయితే కోవిడ్ నుండి కోలుకున్న తరువాత కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్ తనను ఎంతగానో బాధపెట్టాయని వెల్లడించింది.

కరోనా సోకడంతో మందులు ఎక్కువగా వాడడంతో కాస్త బరువు పెరిగితే దానిని టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్ చిరాకు తెప్పించాయని తమన్నా చెప్పింది. అవతలి వారి పరిస్థితి ఎలాంటిదనేది తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడంపై తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరి గురించి కామెంట్ చేసినప్పుడు వారి లోపాలపైనే దృష్టి పెడతారని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది తమన్నా.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus