‘సాహో’ లో అసలు ట్విస్ట్ బయట పెట్టేసిన డైరెక్టర్

  • August 17, 2019 / 05:58 PM IST

‘బాహుబలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ‘యూ.వి.క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతూ పోతున్నారు ఈ చిత్ర నిర్మాతలు. ఇందులో భాగంగా ఆగష్టు 18న ప్రీ రిలీజ్ వేడుకని ఏర్పాటు చేశారు. దీంతో ఈ చిత్రం క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

అయితే ఈ చిత్రంలో ప్రభాస్ దొంగగా, పోలీస్ గా కనిపించబోతున్నట్టు టీజర్, ట్రైలర్లు చెబుతున్నాయి. అయితే సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ను దర్శకుడు సుజిత్ ఇటీవల చెన్నై ప్రెస్ మీట్లో బయటపెట్టాడు. ‘ఈ చిత్రం కథ అందరికీ బాగా నచ్చుతుందని కాప్ గా కనిపించనున్న ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ సరికొత్త థ్రిల్ ఇస్తుందని’ చెప్పుకొచ్చాడు. అంటే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉండదని… ప్రభాస్ పోలీస్ కాదు.. దొంగ అని చెప్పడమే ఆ ట్విస్ట్ అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ట్విస్ట్ ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆగష్టు 30న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus