Sujeeth: మెగాస్టార్ తో ఆ తమిళ రీమేక్ తెరకెక్కించనున్న సుజీత్..!

  • May 26, 2021 / 04:17 PM IST

‘రన్ రాజా రన్’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన సుజీత్..మొదటి చిత్రంతోనే హిట్ కొట్టి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే బాలీవుడ్లో సుజీత్ కు మంచి పేరు దక్కింది. అక్కడి స్టార్ హీరోలు కూడా సుజీత్ తో సినిమా చెయ్యాలని ఎగబడుతున్నారు. ఇదిలా ఉండగా సుజీత్ కు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ ను సుజీత్ తో చెయ్యాలని మొదట చిరు అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండీ సుజీత్ తప్పుకున్నాడు. తరువాత మోహన్ రాజా ఆ రీమేక్ కు ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తో ఓ తమిళ రీమేక్ చెయ్యడానికి సుజీత్ రెడీ అవుతున్నాడట.అజిత్ హీరోగా తెరకెక్కిన ‘ఎన్నై అరింధాల్’ ను తెలుగులోకి రీమేక్ చెయ్యాలని చిరు భావిస్తున్నారు.

ఈ క్రమంలో మొదట శ్రీనువైట్లకు స్క్రిప్ట్ పనులు అప్పగించారు.కానీ అతను సరిగ్గా డెవలప్ చెయ్యలేకపోయాడు అని సమాచారం. దాంతో ఇప్పుడు సుజీత్ కు ఆ రీమేక్ పనులు అప్పగించారని తెలుస్తుంది. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా సుజీత్ ఆ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ దీనిని ఫైనల్ చేస్తేనే సెట్స్ పైకి వెళ్తుంది.లేదంటే మళ్ళీ చిరు.. డైరెక్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టాల్సిందే.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus