అందుకే ‘చిరు 152’ కొత్త స్కెచ్ వేసారట…!

  • March 16, 2020 / 12:09 PM IST

‘సైరా నరసింహారెడ్డి’ … గతేడాది అక్టోబర్ 2న విడుదలయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. అన్ని చోట్ల మంచి రివ్యూలు కూడా వచ్చాయి. ఇక మౌత్ టాక్ అయితే దేశం గర్వించదగ్గ చిత్రం అనే ప్రశంసలు అందుకుంది. అయితే తెలుగులో ఎబౌవ్ యావరేజ్ గా వసూళ్లను రాబట్టింది తప్ప… మిగిలిన అన్ని చోట్ల ఈ చిత్రం నష్టాల్నే మిగిల్చింది. ఈ చిత్రం వల్ల నిర్మాత రాంచరణ్ కు రూపాయి మిగిలింది లేదు… కానీ ఈ ఎఫెక్ట్ ఇప్పుడు తాను నిర్మిస్తున్న ‘ఆచార్య’ బిజినెస్ పై కూడా పడిందని తెలుస్తుంది.

‘ఆచార్య’ చిత్రానికి చిరు, చరణ్ లు అనుకున్న స్థాయిలో బిజినెస్ కావడం లేదట. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి… ముందుకొస్తున్నప్పటికీ.. ‘సైరా’ ఫలితం వల్ల బయ్యర్స్ కాస్త ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇక ‘సైరా’ డిజిటల్ రైట్స్ … భారీ రేటుకి అమ్ముడు పోయినప్పటికీ… కొనుగోలు చేసినవారికి కూడా నష్టాలే మిగిలినట్టు తెలుస్తుంది. సో డిజిటల్ రైట్స్ పరంగా కూడా ‘ఆచార్య’ కు గట్టి రేటు పలకడం లేదు. దీంతో ఈ చిత్రంలో రాంచరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి, ఉగాది రోజునాడు చిరు – చరణ్ లు ఇద్దరూ కలిసున్న పోస్టర్ ను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట. దీంతో భారీ హైప్ క్రియేట్ అయ్యి… బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట. మరి వారి ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus