ఎన్టీఆర్ తో మరోసారి స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ

  • August 28, 2017 / 12:43 PM IST

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా టాకీ పార్ట్  పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో మిగిలిఉన్న రెండు పాటల్లో ఒక పాటను రీసెంట్ గా  హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన అందమైన సెట్ లో రాశీ ఖన్నా, తారక్ పై కంప్లీట్ చేశారు. ఇక మిగిలి ఉన్నది ఒకే ఒక సాంగ్. అదేంటో తెలుసా ఐటెం సాంగ్. జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ మాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వారి కోసం ఇందులోనూ ఓ స్పెషల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాటలో అందాలు ఆరబోయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాని సెలక్ట్ చేసినట్లు ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

ఊసరవెల్లి సినిమాలో తమన్నా, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇప్పుడు ఒక పాటలో కలిసి డ్యాన్స్ వేయనున్నారు. ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు.. వీరి కాంబినేషన్లో రాబోతున్న సాంగ్ ఓ ఊపు ఊపడం గ్యారంటీ. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు కనివిందు చేయనున్నారు. వీరికి తమన్నా తోడు అయింది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus