‘మిస్టర్’ లో ‘తేజస్వి’..!

  • May 7, 2016 / 11:47 AM IST

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా పాత్రలను ఎంపిక చేసుకుంటోంది తేజస్వి మడివాడ. ఇటీవలే కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..తాజాగా వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర కోసం ఎంపికైనట్లు సమాచారం. చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తేజస్విని కలిసి ఈ చిత్రంలో తన పాత్ర గురించి వివరించగా,

ఈ చిత్రంలో ఆమె నటించడానికి అంగీకరించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ లు జంటగా నటిస్తున్నారు. నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 15 నుంచి స్పెయిన్ లో షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus