గాయాల పాలైన సినీ నటుడు నర్సింగ్ యాదవ్…?

  • April 10, 2020 / 11:54 AM IST

‘ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడన్నా’.. అనే డైలాగ్ పలికిన నర్సింగ్ యాదవ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. అనేక సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో ఉంటూ అప్పుడప్పుడూ కామెడీ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్చేస్తూ ఉంటాడు. అలాంటి నటుడు ఇప్పుడు గాయాల పాలయ్యి కోమాలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అతను కోమా లో ఉన్న మాట నిజమే..! కానీ గాయాలు పాలయ్యి కాదని ఆతని భార్య తెలిపింది.

ఆయన ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆయినప్పటికీ పరిస్ధితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ విషయం పై నర్సింగ్ యాధవ్ భార్య చిత్ర యాదవ్ మాట్లాడుతూ…”నా భర్త సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో మేము సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించము.ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము.అనుకోకుండా కోమా లోకి వెళ్ళాడు , 48 గంటలు పాటు అబ్జర్ వేశాన్ లో ఉంచారు.

ఇంకా వెంటిలేటర్ పై నే చికిత్స కొనసాగుతుంది.ఇంట్లో కింద పడిపోయాడు, తల కి గాయం అయ్యింది అని వస్తున్న వార్త లు అవాస్తవం.తను ఎక్కడ పడిపోలేదు , ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడు.కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి” అంటూ విన్నపించింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus