టాలీవుడ్ ఇండస్ట్రీ పై మరో నటి ఘాటు కామెంట్స్…!

  • April 25, 2020 / 07:05 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఈ అంశం పై పెద్ద ఆర్టిస్ట్ ల దగ్గర నుండీ చిన్న ఆర్టిస్ట్ ల వరకూ ఎంతో మంది స్పందించారు. కెరీర్ ప్రారంభంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని పలు సార్లు మీడియాతోనూ, సోషల్ మీడియా తోనూ పంచుకున్నారు. కొన్నాళ్ళు దీని పై రచ్చ జరిగింది కానీ… తరువాత సైలెంట్ అయిపొయింది. ‘మీటూ’ వంటి ఉద్యమాలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు గురించి చెప్పినా..

ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలా అని నటీమణులు తమ బాధను వ్యక్తం చెయ్యడం కూడా ఆపలేరు కదా. ఇప్పుడు నటి రాగిణి కూడా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ…”నా తల్లిదండ్రులకు 13 మంది సంతానం. నేను 12 వ దాన్ని. నటిగా రాణించాలి అనే ఉద్దేశంతో సినీ రంగంలో అడుగు పెట్టాను. కెరీర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయాను.

సినీ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తే.. వాళ్ళు పై నుండీ కింద వరకూ చూసి వస్తావా అని అడిగేవారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. తెలిసిన వాళ్ళ ద్వారా దూరదర్శన్ లో అవకాశం రావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది రాగిణి. ఈమె ‘అమృతం’ సీరియల్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus