ఈ ఘట్టమనేని వారసుడైనా నిలదొక్కుకుంటాడా.!

  • April 16, 2018 / 10:29 AM IST

మెగా ఫ్యామిలీ నుంచి వారసులొస్తున్నారు, హీరోలుగా నిలదొక్కుకుంటున్నారు. ప్రస్తుతం కేవలం మెగా ఫ్యామిలీ నుంచే ఏకంగా పదిమంది హీరోలున్నారు. అలాగే.. నందమూరి కుటుంబం నుంచి కూడా వారసులొస్తున్నారు. అక్కినేని కుటుంబం నుంచి ఆల్రెడీ ఇద్దరు హీరోలొచ్చారు. ఇలా అగ్ర కథానాయకుల కుటుంబాల నుంచి కథానాయకులు క్యూ కట్టడం అనేది చాన్నాళ్లుగా జరుగుతోంది. అయితే.. ఒక్క ఘట్టమనేని కుటుంబం నుంచి మాత్రం మహేష్ బాబు తర్వాత సరైన హీరో రాలేదు.

సుధీర్ బాబు విశ్వప్రయత్నం చేసినా హీరోగా సెటిల్ అవ్వలేకపోయాడు. మధ్యలో వచ్చిన కృష్ణమాధవ్ సినిమా విడుదలైన తర్వాత కనిపించలేదు. ఇప్పుడు ఘట్టమనేని వంశం నుంచి గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయమయ్యేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. “ఆడు మగాడ్రా బుజ్జి” ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. షూటింగ్ లొకేషన్స్ కూడా ఫైనల్ చేయబడిన ఈ చిత్రంలో కథానాయిక ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు. సమ్మర్ తర్వాత సినిమా సెట్స్ కు వెళ్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus