మాస్‌ ఎంటర్‌టైనర్‌ను స్టార్‌ హీరో మిస్‌ అయ్యాడా?

  • January 13, 2021 / 12:31 PM IST

ఓ సినిమా హిట్‌ అయ్యాక… ఆ సినిమా ఫలానా హీరో చేయాల్సింది, మిస్‌ అయ్యాడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా టాపిక్‌లో నిలిచిన సినిమా ‘క్రాక్‌’. సంక్రాంతి కానుకగా ఇటీవల ఈ సినిమా బాక్సాఫీసు దగ్గరకు వచ్చి అదరగొట్టింది. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఈ సినిమా చక్కగా తెరకెక్కించాడని విమర్శకులు మెచ్చుకుంటున్నారు. అభిమానులైతే మా మాస్‌ మహారాజ్‌కి సరైన హిట్ పడింది అంటూ మురిసిపోతున్నారు. అయితే ఇదంతా వెంకేటేశ్‌ అభిమానులు మిస్‌ అయ్యారంటే నమ్ముతారా?

గోపీచంద్‌ మలినేని ‘క్రాక్‌’ కథను చాలామంది హీరోలకు చెప్పాడు. అయితే వెంకటేశ్‌ దగ్గర ఈ సినిమా కథ చాలా రోజులు ఉందట. సినిమా కథ, కథనం విషయంలో వెంకటేశ్‌ అండ్‌ కో కి నమ్మకం కలగకపోవడంతో మెటీరియలైజ్‌ కాలేదట. వెంకటేష్‌ కథ విన్న తర్వాత చెప్పిన మార్పులు, చేర్పులు విషయంలో గోపీచంద్‌ ఆసక్తి చూపించలేదట. అలా సినిమా చేస్తేనే బాగుంటుందని అనుకున్నాడట. దీంతో సినిమా కథ వెంకటేశ్‌ దగ్గర నుంచి బయటికొచ్చేసింది. అదే కథను రవితేజ వద్దకు తీసుకు వెళ్లగా ఆయన ఓకే చెప్పాడు.

‘క్రాక్‌’కి ముందు ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అలా గోపీచంద్‌ను రవితేజ నమ్మి సినిమా ఓకే చెప్పాడట. ఆ తర్వాత నిర్మాతల దగ్గరకు వెళ్లడం, సినిమా మొదలవ్వడం, లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యమవ్వడం, సంక్రాంతికి చిన్న ఇబ్బందుల తర్వాత వచ్చినా ఆకట్టుకుంది. ఏదేమైనా రవితేజకి హిట్‌ రాసిపెట్టుంది కాబట్టి అయ్యింది. వెంకీకి మిస్‌ అయ్యింది. ఏమాటకామాట వెంకీ ఈ సినిమా చేసుంటే ఇంకా బాగుండేదేమో అని అభిమానులు తప్పక అనుకుంటూ ఉంటారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus