Ajith: అజిత్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం వెనుక కథ ఇదేనా?

  • January 5, 2023 / 01:46 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అజిత్ ఈ నెల 11వ తేదీన తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 3 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తమిళంలో తునివు అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం అజిత్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెగింపు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

సాధారణంగా తమ సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోలు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే సినిమా సక్సెస్ అవుతుందని ఆయన భావిస్తారు. అయితే అజిత్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి పదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఒక ఘటన కారణం కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఒక అభిమాని మృతి చెందగా ఆ ఘటన అజిత్ ను ఎంతగానో బాధ పెట్టింది.

అజిత్, విజయ్ అభిమానుల మధ్య జరిగిన గొడవలో విజయ్ ఫ్యాన్ ఒకరు మృతి చెందడం జరిగింది. అభిమానుల మధ్య గొడవను ఆపాలనే ఆలోచనతో అజిత్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు. అజిత్ ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నా లుక్ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోకపోయినా ఆయన సినిమాలకు కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సోషల్ మీడియాకు సైతం అజిత్ దూరంగా ఉంటున్నారు.

అజిత్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా తెగింపు సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అజిత్ ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus