Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య ఒంటరిగా తిరుమల వెళ్లడానికి కారణాలివేనా?

  • January 31, 2024 / 04:17 PM IST

బన్నీ భార్య స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పిల్లల పెంపకం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి స్నేహారెడ్డి పంచుకోగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా స్నేహారెడ్డి ఒంటరిగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే స్నేహారెడ్డి తిరుమలకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అదే సమయంలో స్నేహారెడ్డి ఒంటరిగా తిరుమల రావడం వెనుక కూడా భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఏదైనా పనిని మొదలుపెట్టిన సమయంలో, ఆ పని పూర్తైన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

స్నేహారెడ్డి  (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూనే అదే సమయంలో వివాదాలకు తావివ్వకుండా కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు. స్నేహారెడ్డి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బన్నీ విషయానికి వస్తే షూటింగ్ తో ఈ స్టార్ హీరో బిజీగా ఉన్నారు. పుష్ప ది రూల్ సినిమాను చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతుండగా ఈ సినిమా వాయిదా పడితే ఆ డేట్ కు రిలీజ్ కావడానికి ఇతర హీరోల సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

సాధారణ రిలీజ్ డేట్ల కంటే స్పెషల్ డేస్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బన్నీ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత లేదు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్న డైరెక్టర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అల్లు అర్జున్ ఇతర బాషల్లో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ సత్తా చాటుతున్నారు. పుష్ప2 సినిమా హిందీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus