‘ధృవ’కు ఆడియో వేడుక లేదంట.!!

  • November 4, 2016 / 11:05 AM IST

టాలీవుడ్ లో హీరోలు మాత్రమే కాదు నిర్మాణ సంస్థలు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తోంది. తెలుగు పరిశ్రమలో చిన్న, పెద్ద సినిమాల పాటల పండుగను వైభవంగా నిర్మించడం గత శతాబ్దికాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ  పద్ధతిని అల్లుఅరవింద్ మారుస్తున్నారు. తొలిసారి సరైనోడు చిత్రానికి ఆడియో వేడుకను నిర్వహించకుండా పాటలను మార్కెట్లోకి రిలీజ్ చేసి, ఆతర్వాత మూడు చోట్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపారు.

ఈ పద్ధతిని శ్రీరస్తు శుభమస్తు సినిమాకు కూడా పాటించారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్నధృవ కి కూడా ఆడియో విడుదల వేడుకను చేయడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ పాటలను  నవంబర్ 9 న చాలా సింపుల్ గా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఆతర్వాత పలుచోట్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించే ప్లాన్ లో అల్లు అరవింద్ ఉన్నారు. ఈ విధంగా గీతా ఆర్ట్స్ ట్రెండ్ ని ఫాలో కాకుండా, ట్రెండ్ ని సృష్టిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్ పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus