ఆసక్తికరంగా మారిన శుక్రవారం సినిమాల పోరు

  • May 29, 2019 / 02:52 PM IST

గతవారం ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ.. ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అయితే.. ఈవారం మాత్రం మూడు భారీ సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి. వాటిలో పెద్ద సినిమా “ఎన్ జి కె”. కల్ట్ డైరెక్టర్ సెల్వరాఘవన్ చాన్నాళ్ల విరామం అనంతరం తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య, సాయిపల్లవి, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించారు. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద ప్రేక్షకులకు పెద్ద అంచనాలు లేవు కానీ..
సెల్వరాఘవన్ ఫ్యాన్స్ మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అలాగే.. “అభినేత్రి” చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన “అభినేత్రి 2” కూడా శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుదేవ, తమన్నా జంటగా రూపొందిన ఈ హారర్ కామెడీ మీద అంచనాలు లేవు కానీ.. తమన్నా అందాలు ప్రేక్షకుల్ని థియేటర్లవైపుకు లాగుతున్నాయి. ఇక మూడోది “ఫలక్ నుమా దాస్”.. “ఈ నగరానికి ఏమైంది” ఫేమ్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విశేషమైన బజ్ క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అంగమలై డైరీస్” రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి మంచి హైప్ కూడా ఉంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలుగుతుందో లేదో చూడాలి. ఈ మూడు తెలుగు సినిమాలతోపాటు మోస్ట్ ఏవైటింగ్ “గాడ్జిల్లా 2” కూడా విడుదలవుతోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus