Prabhas, Prashanth Neel: డార్లింగ్‌ మైల్‌ స్టోన్‌ సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌!

అదేంటి… ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా టైటిల్‌ ఎప్పుడో ప్రకటించేశారు కదా… ఇప్పుడు మళ్లీ ఏంటి అనుకుంటున్నారా. ఇది ఇప్పుడు షూటింగ్‌ అవుతున్న సినిమా గురించి కాదు. త్వరలో మొదలవ్వాల్సిన సినిమా గురించి. అవును ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్‌’ తర్వాత మరో సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ 25వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత.

ప్రభాస్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో సినిమా కోసం చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోనూ అది మైల్‌స్టోన్‌ కావడంతో ప్రశాంత్‌ నీల్‌తో డీల్‌ సెట్‌ చేశారు దిల్‌ రాజు. ‘సలార్‌’ అయిన తర్వాత ప్రశాంత్‌ నీల్ ఈ కథ మీద కూర్చుంటారట. ఈలోపు ప్రభాస్‌ మిగిలిన సినిమాలన్నీ పూర్తి చేసి ఇటు వస్తారట. ఈ గ్యాప్‌ నీల్‌ మరో హీరోతో సినిమా చేస్తారు అనే మాట కూడా వినిపిస్తుంది. దాని సంగతి తర్వాత తేలుతుందిలెండి.

ఇక ప్రభాస్‌ 25కి సంబంధించి టాలీవుడ్‌ వర్గాల్లో ఓ టైటిల్‌ చక్కర్లు కొడుతోంది. అదే ‘వృందావన’. ఇదేంటి ఇదేదో కన్నడ పేరులా ఉంది అనుకుంటున్నారా? కానీ ఇదే పేరు చర్చల్లో ఉంది. అయితే ‘బృందావన’ని ఇలా చేశారా అనే టాక్‌ కూడా నడుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే… ఈ సినిమా 2024లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus