ముంబయ్ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యిన హాట్ హీరోయిన్

  • September 14, 2020 / 03:57 PM IST

‘ఆర్ఎక్స్ 100’ సూపర్ సక్సెస్‌తో టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆమెను వెతుక్కుంటూ సినిమాలు వస్తున్నాయి. సో, ముంబయ్ నుండి హైదరాబాద్‌కి పాయల్ రాజ్‌పుత్ షిఫ్ట్ అయ్యింది. ముంబయ్‌లో బ్యాగులు సర్దుకుని రెండు కుక్కపిల్లలతో సహా హైదరాబాద్ వచ్చేసింది. “ఫ్రీక్వెంట్‌గా ముంబయ్ టు హైదరాబాద్ ట్రావెల్ చెయ్యడం పెయిన్. రెండేళ్ళ నుండి అదే పని చేస్తున్నా. పైగా, హోటళ్ళలో ఉండి అలసట, విసుగు వచ్చాయి.

అందుకని, బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ సిటీకి మూవ్ అయ్యా” అని పాయల్ చెప్పింది. కరోనా టైమ్‌లో ట్రావెల్ చెయ్యడం అంత మంచిది కాదని అనుకోవడం కూడా ఈ డెసీషన్ తీసుకోవడానికి మరో రీజన్ అట. తన లైఫ్‌లో ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అంటోంది.  పాయల్ పేరెంట్స్ కూడా హైదరాబాద్ వస్తారట. ఆమెకు సపోర్ట్ గా. హోటళ్ళలో ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందనీ, ఇంటి భోజనం కోసం చూస్తున్నానని పాయల్ అన్నది.

ఆల్రెడీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని, ఫర్నిచర్ కోసం చేస్తున్నాని తెలియజేసింది. రీసెంట్‌గా సిటీకి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక యాడ్ షూట్ కంప్లీట్ చేసింది. దానికి ఓన్ డబ్బింగ్ చెప్పుకోంది. త్వరలో తెలుగు ట్యూటర్ పెట్టుకుని క్లాసులు చెప్పించుకుంటానని, తెలుగు నేర్చుకుంటానని అంటోంది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus