డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన ఎక్సైజ్ శాఖ

  • July 14, 2017 / 06:41 AM IST

తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతం వెంటాడుతోంది. మత్తుకు ఆకర్షితులై తమ మంచి పేరుకు మచ్చ తెచ్చిపెట్టుకుంటున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ను విచారించగా వివిధ రంగాలకు చెందిన వారితో పాటు, సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది స్టార్లు డ్రగ్స్ వలలో చిక్కుకున్నట్లు తెలిసింది. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.

నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు,  చార్మీ, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్) పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus