సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నిత్యం ఎవరొకరు మరణిస్తుండటం అందరినీ కలవరపరిచే విషయం. అనారోగ్య సమస్యలతో కొంతమంది, రోడ్డు ప్రమాదాలకు గురై కొంతమంది, వయోభారంతో కొంతమంది, బలవన్మరణానికి పాల్పడి ఇంకొంతమంది ఇలా ఎవరొకరు మరణిస్తూనే వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా ఎవరొకరు మరణిస్తూ ఉండటం షాకిచ్చే అంశం.
ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. ‘కేడీ’ దర్శకుడు కెకె, అల్లరి నరేష్ తాతయ్య గారు, సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి, సీనియర్ నటి జయవాహిని వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాత ఈరోజు మృతి చెందినట్టు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయినటువంటి వెల్లంపల్లి ప్రసాద్(Vellampalli Prasad) ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతోనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. గతంలో ఈయన ‘టెన్త్ క్లాస్’ ‘నోట్ బుక్’ వంటి సినిమాలు నిర్మించారు. ‘టెన్త్ క్లాస్’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘నోట్ బుక్’ సినిమా ఆడలేదు. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ ‘నోట్ బుక్’ సినిమాలో హీరోగా నటించాడు.
‘టెన్త్ క్లాస్’ సినిమాని తెరకెక్కించిన చందునే ‘నోట్ బుక్’ ని డైరెక్ట్ చేశారు. అటు తర్వాత ‘చెక్ మేట్’ సినిమాని కూడా నిర్మించారు వెల్లంపల్లి ప్రసాద్. ఈ సినిమాలో యాంకర్ విష్ణు ప్రియ హీరోయిన్ గా నటించింది. దీనికి స్వయంగా వెల్లంపల్లి ప్రసాద్ దర్శకత్వం వహించారు.