హీరో సినిమా ఆగిపోయిందనే వార్తలు ఎందుకొస్తున్నాయో అర్ధం కావడం లేదు

  • November 1, 2019 / 07:39 PM IST

“డియర్ కామ్రేడ్” డిజాస్టర్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా మొదలెట్టిన కొత్త సినిమా “హీరో” షూటింగ్ ఆగిపోయిందని, బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాను నిలిపివేశారని రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రూమర్స్ అన్నిటికీ ఒకేసారి సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తాను నిర్మించిన “మీకు మాత్రమే చెప్తా” నేడు విడుదలవుతుండగా.. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో విజయ్ మాట్లాడుతూ.. “హీరో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు చాలా స్కోప్ ఉంది. అవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ముందుగా ప్రీవిజువలైజ్ చేసుకోవాలి. అందుకే ఆ ప్రొజెక్ట్ కు అనుకున్నదానికంటే ఎక్కువ టైమ్ పడుతుంది” అని చెప్పుకొచ్చాడు విజయ్. అసలు ఇలాంటి రూమర్స్ అన్నీ ఎందుకొస్తున్నాయో తనకు కూడా అర్ధం కావడం లేదు, అలాగని రూమర్ వచ్చినప్పుడల్లా రియాక్ట్ అవ్వడం కూడా సరికాదు అని ఊరుకుంటున్నాను అని పేర్కొన్నాడు విజయ్.

అలాగే.. తన నెక్స్ట్ సినిమా పూరీ జగన్నాధ్ తో అని, అది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రకటించిన విజయ్.. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నానని కన్ఫర్మ్ చేశాడు. ఈ రెండు సినిమాల అనంతరం “హీరో”ను ఫినిష్ చేస్తాడట. అలాగే.. త్వరలోనే బాలీవుడ్ సినిమా కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు విజయ్. మరి బాలీవుడ్ లో ఏదైనా సినిమా ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus