Upasana: వైరల్ అవుతున్న ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 10, 2024 / 08:20 PM IST

మెగా కోడలు ఉపాసన చేసే ప్రతి కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో ప్రతిభ ఉన్న ఉపాసన కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఉపాసనను నేటి తరం యువత సైతం బిజినెస్ ఉమెన్ గా ఎంతో అభిమానిస్తారు. చిరంజీవికి (Chiranjeevi) పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఉపాసన “మామయ్యా.. క్లీంకారకు, నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి” అని అడగగా చిరంజీవి కొన్ని సెకన్ల పాటు ఆలోచించి క్లీంకార నీకు ప్రతిరూపం అని చెప్పారు.

ఉపాసన వెంటనే “కాదు.. నేను, క్లీంకార పద్మ విభూషణ్ ల మనవరాళ్లం” అని చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాసన చేసిన ఈ కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు క్లీంకార తాత చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ రావడం మరోవైపు ఉపాసన తాత ప్రతాప్ సి. రెడ్డికి 2010 సంవత్సరంలోనే పద్మవిభూషణ్ రావడంతో ఉపాసన ఈ కామెంట్లు చేశారు. పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న తర్వాత చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కళామతల్లికి, కళామ రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని చిరంజీవి అన్నారు. నన్ను ప్రేమించి అభిమానించిన అందరికీ పద్మవిభూషణ్ అందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన కామెంట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి సినిమా రంగానికి అందించిన సేవలకు మరెన్నో అవార్డులు రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus