Upasana: గవర్నర్ తమిళ సై ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెగా కోడలు ఉపాసన!
February 2, 2024 / 12:43 PM IST
|Follow Us
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఇంటి కోడలుగా రామ్ చరణ్ భార్యగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇలా ఈమె తన వ్యవహారాలన్నిటిని చక్క పెడుతూ మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ఉపాసన ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంటారు.
ఇటీవల తన కుమార్తె క్లీన్ కారా నామకరణ మహోత్సవం రోజున కూడా ఈమె గిరిజన సాంప్రదాయ పద్ధతిలోనే ఈ వేడుకలను నిర్వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇలా గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె తాజాగా గవర్నర్ తమిళసైని కలిశారు. తెలంగాణ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి తమిళసై గిరిజనుల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు నా హృదయాన్ని హత్తుకున్నాయంటూ ఉపాసన గవర్నర్ పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే గవర్నర్ తమిళసైని కలిసినటువంటి (Upasana) ఉపాసన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి చిత్రపటాన్ని బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరోసారి గవర్నర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు తన ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨ @DrTamilisaiGuv #tribalwelfarepic.twitter.com/dUAXqZ5Zi4