కొడుకుని హీరోగా పరిచయం చేస్తోన్న దర్శకుడు!

  • February 23, 2021 / 03:49 PM IST

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పట్లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం నలభై లక్షల్లో నిర్మించిన సినిమా కోట్లలో లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరో ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని ఆ తరువాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘చిత్రం 1.1’ అనే సినిమా రాబోతుంది.

తనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన ఆర్ఫీ పట్నాయక్ ను ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడు తేజ. ‘చిత్రం’ సినిమా మాదిరి ఈ సినిమాలో కూడా అందరూ కొత్త వాళ్లనే తీసుకోవాలనుకుంటున్నాడు తేజ. ఇప్పుడు తనకు ఉదయ్ కిరణ్ లాంటి హీరో ఒకరు కావాలి. ఈ రోల్ కోసం ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తేజ తనయుడు అమితవ్ తేజ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

తన కొడుకుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తేజ భావిస్తున్నాడట. అమితవ్ కి ప్రస్తుతం నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట తేజ. తన కథకు అమితవ్ సరిపోతాడని.. త్వరలోనే ఓ ట్రయల్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు తేజ. అమితవ్ నటన సంతృప్తిగా అనిపిస్తే.. ఈ సినిమాలో తననే హీరోగా ఫిక్స్ చేయాలనుకుంటున్నాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus