మల్టీ స్టారర్ సినిమాకు అంతా సిద్ధం చేసిన శ్రీరామ్ ఆదిత్య!

  • February 2, 2018 / 03:01 PM IST

ప్రస్తుతం కింగ్ నాగార్జున వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకి శపథం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ నెలలలో పూర్తి కానుంది. దీని తర్వాత నానితో కలిసి మల్టీ స్టారర్ మూవీని నాగ్ మొదలు పెట్టనున్నారు.  “భలే మంచిరోజు”,  “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి అంతా సిద్ధం చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నాగార్జున డాన్ గా కనిపించనున్నారు.

నాని డాక్టర్ గా తనదైన నటనతో నవ్వులు పూయించనున్నారు. వీరి పక్కన జోడీగా నటించే హీరోయిన్స్ కోసం డైరక్టర్ వెతుకుతున్నారు. అలాగే ఈ  సినిమా షూటింగ్ డేట్ ని చిత్ర బృందం ఫిక్స్ చేశారు. వచ్చే నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని కృష్ణార్జున యుద్ధం  సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. దీని తర్వాత మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus