NTR30: తారక్ తో కొరటాల తీయబోయే కథ ఇదే!

  • April 19, 2021 / 06:32 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఎన్టీఆర్.. కొరటాల సినిమా మొదలుకానుంది. ‘జనతా గ్యారేజ్’ కోసం గాడ్ ఫాదర్ లాంటి స్టోరీ రాసుకున్న కొరటాల.. ఈసారి ఎన్టీఆర్ కోసం పొలిటికల్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

ఇదివరకు మహేష్ బాబుతో తీసిన ‘భరత్ అనే నేను’ స్టోరీ రాజకీయాల నేపథ్యంలోనే సాగుతుంది. ఓ యంగ్ సీఎం సొసైటీని ఎలా ప్రభావితం చేశాడనే పాయింట్ తో ‘భరత్ అనే నేను’ సినిమా తీశాడు. అయితే ఈసారి రాజకీయాలను మరో కోణంలో చూపించబోతున్నారని సమాచారం. ఓ సామాన్యుడు తలచుకుంటే ఏం చేయగలడో.. తన సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాడు కొరటాల. ఆయన సినిమాల్లో ఎమోషన్స్ బాగా పండుతాయి. ఈసారి కూడా ఎమోషన్స్ ప్రధానంగా సినిమాను నడిపించబోతున్నాడు.

పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్, హీరోయిన్ల కోసం వేట మొదలెట్టారు. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. బాలీవుడ్ నుండి ఓ హీరోయిన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus