Rajamouli, Mahesh Babu: జక్కన్న గ్యాప్ తీసుకోవడం లేదా..?

  • June 30, 2021 / 11:13 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే రాజమౌళి తరువాత సినిమా హడావిడి మొదలైంది. సాధారణంగా రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్య కాస్త గ్యాప్ తీసుకుంటారు. నెక్స్ట్ సినిమా ఎలాంటి కథతో తీయాలి..?

ఎంత రేంజ్ లో తెరకెక్కించాలని ఆలోచిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అంత గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే తరువాత సినిమా మహేష్ బాబుతో అని ఫిక్స్ అయింది. దీనికి నిర్మాతగా కేఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మీటింగ్ లు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నిర్మాత కేఎల్ నారాయణ చాలాసార్లు రాజమౌళిని అలానే మహేష్ బాబుని కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

రాజమౌళి కూడా మహేష్ బాబుని కలిసి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్డేట్స్ తో పాటు మహేష్ సినిమా ప్లానింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి పెద్దగా గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు లేరు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus