బడ్జెట్ వల్లే ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేసారా ?

  • June 2, 2020 / 08:00 AM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 5 శాతం మినహాయిస్తే.. దాదాపు పూర్తయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.

‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట ఇప్పటికే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి.. సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. నిజానికి ఏప్రిల్ 2నే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని భావించారు కానీ.. లాక్ డౌన్ వల్ల కుదర్లేదు. ఇప్పడు ఇంకా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ‘ఉప్పెన’ చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చెయ్యమని బాగా 16కోట్లు ఆఫర్ వచ్చిందట. కానీ దీనిని దర్శక నిర్మాతలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఓ కొత్త హీరో సినిమాకి 16కోట్లు ఆఫర్ చెయ్యడం అంటే చాలా ఎక్కువే. కానీ ఈ చిత్రానికి 25కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారట. అందులోనూ మెగా హీరో..! సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి. ఇలాంటి టైం లో 9 కోట్ల నష్టానికి ఆన్లైన్ లో విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని.. థియేట్రికల్ రిలీజ్ ఇస్తే ఈజీగా 80 శాతం రికవర్ అయ్యే అవకాశం ఉందని భావించి.. ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. మరి వీరి ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus