సీత పాత్ర కోసం ఊర్వశి రౌటెలా అట.. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు..!

  • September 9, 2020 / 01:31 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 22వ చిత్రం ‘ఆది పురుష్’. గుల్షన్ కుమార్, ‘టి సిరీస్ ఫిలిమ్స్’ సమర్పణలో ‘రెట్రోఫైల్స్ ప్రొడక్షన్’, బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంటి బడా నిర్మాతలు కలిసి .. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు.. కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు.

‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఆయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక లంకాదిపతిగా ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ ‘లంకేష్’ గా కరీనా కపూర్ భర్త మరియు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు.ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే సీత పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం పై మాత్రం రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

మొన్నటి వరకూ కీర్తి సురేష్ అన్నారు..తరువాత ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ సీత పాత్రలో కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటెలా పేరు వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈమె బోల్డ్ పాత్రలే పోషించింది. అన్నీ గ్లామర్ డోస్ కలిగిన పాత్రలే..! మరి ఈమె సీత పాత్రకు సరిపోతుందా. ఒకవేళ సరిపోయినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus