రాజశేఖర్ కావాలనే అలా అంటున్నాడా!

  • October 17, 2017 / 10:11 AM IST

“నేను నిజం మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ నాపై పగబట్టాడు” అంటూ రాజశేఖర్ తన తాజా చిత్రం “పి.ఎస్.వి గరుడ వేగ” ప్రమోషన్స్ లో కొన్ని పాత విషయాలను హైలైట్ చేస్తూ చెబుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. “ప్రజారాజ్యం” పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు రాజశేఖర్ ను ఉద్దేశించి “అతనికి తెలుగు మాట్లాడడం కూడా సరిగా రాదు, అతనికి పాలిటిక్స్ ఎందుకు?” అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆ విషయంలో జీవితా రాజశేఖర్ ఇన్వాల్వ్ అయ్యి.. “పవన్ కళ్యాణ్ కి నిల్చోవడం కూడా సరిగా రాదు” అంటూ కౌటర్ వేసింది. అయితే.. ఈ ఇష్యూ ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చిందంటే మాత్రం అందుకు కారణం కొన్ని న్యూస్ చానల్స్ అంటున్నారు “పి.ఎస్.వి గరుడ వేగ” బృందం.

ఈమధ్య కొన్ని న్యూస్ చానల్స్ టీయార్పీ రేటింగ్స్ కోసం మరీ దారుణమైన క్వశ్చన్స్ అడుగుతున్నాయి. యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం కోసమే ఈ ప్రోమోలను కట్ చేస్తున్నారు. అలా చేసిన ఘాతకమే ఈ రాజశేఖర్ అండ్ పవన్ కళ్యాణ్ క్లాష్ అటెంప్ట్. సినిమా ప్రమోషన్స్ కు, చానల్ టీయార్పీ పెంచడానికి ఈ ఇష్యూ ఎంతవరకూ పనికొచ్చిందో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఇష్యూ మీద అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus