Vaishnav Tej: మెగాహీరోల కోసం వైష్ణవ్ తేజ్ న్యూ స్టోరీ!

  • October 8, 2021 / 04:16 PM IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడు రెండవ సినిమా కొండపొలం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ చదువుకున్న ఒక గొర్రెల కాపరి గా కనిపించబోతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ లోని ఒక కొత్త టాలెంట్ గురించి చెప్పాడు.

అతనికి కథలు రాయడం అంటే కూడా చాలా ఇష్టమని చెబుతూ.. మెగా హీరోల కోసం కూడా మంచి కథ రాశాడు. ఆ కథ కూడా నాకు చెప్పాడు. ఇక అందులో మెగా హీరోలందరికీ కూడా కూడా పాత్రలు ఉండేలా కథను డిజైన్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా ఆ కథకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు దర్శకుడు క్రిష్ వివరణ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ ఒక నటుడిగా ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడు.

అతడిని మంచి దర్శకుడిగా కంటే కూడా ఒక మంచి నటుడిగానే చూడాలని ఉన్నట్లు తెలియజేసిన క్రిష్ అతడి సింపుల్సిటీ నాకు చాలా బాగా నచ్చింది అని తెలియజేశాడు. ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కు చాలా ఓపిక ఉంది అంటూ అందరిని ఒకేలా గౌరవిస్తాడు అని డైరెక్టర్ నుంచి లైట్ మ్యాన్ వరకు కూడా అందరితో ఒకేలా మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని క్రిష్ తెలిపారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus