Vaisshnav Tej: వైష్ణవ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా..!

  • August 27, 2024 / 10:25 AM IST

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్  (Sai Dharam Tej) తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే దాని సక్సెస్ క్రెడిట్ అంతా హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) , సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కొట్టేశారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ (Konda Polam) ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) ‘ఆదికేశవ’ (Aadikeshava) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి.

Vaisshnav Tej

‘ఆదికేశవ’ రిలీజ్ అయ్యి 10 నెలలు కావస్తున్నా.. తన నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రారంభించలేదు. కనీసం నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. బహుశా.. వైష్ణవ్ తేజ్ గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడేమో అని అంతా భావిస్తున్నారు..! ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్.. ఓ కథని ఓకే చేసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే, దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఇటీవల వైష్ణవ్ ని కలిసి ఓ కథ చెప్పాడట. అది అతనికి నచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఓకే చెప్పేశాడట.

అయితే ఇంతలో కృష్ణ చైతన్య.. విశ్వక్ సేన్ (Vishwak Sen) తో ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) వచ్చింది. అది ప్లాప్ గా మిగిలింది. అయినా సరే కృష్ణ చైతన్యకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు విశ్వక్. అది కూడా పెద్ద స్కేల్ మూవీనే..! అది కంప్లీట్ అయ్యాకే వైష్ణవ్ తేజ్ తో అతని సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. శ్రీనివాసా చిట్టూరి ఆ ప్రాజెక్టుని నిర్మించే ఛాన్సులు ఉన్నాయి.

బాలీవుడ్ ఎంట్రీ పై నాని కామెంట్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus