స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయనున్న వంశీ

  • November 24, 2016 / 06:53 AM IST

సినీ పరిశ్రమలో ఎవరు ఎవరిని డైరక్ట్ చేస్తారో? ఏ దర్శకునితో ఏ హీరో సినిమా చేస్తాడో చెప్పడం అంత సులువు కాదు. ‘కిక్’, ‘రేసుగుర్రం’, ఊసరవెల్లి, ‘టెంపర్’ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ  యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నట్లు మొన్నటిదాకా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వంశీ బన్నీ గూటికి చేరినట్లు తెలిసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కి వంశీ చెప్పిన కథ నచ్చడంతో డైరక్టర్ గా అవకాశమిచ్చినట్లు సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తైన ఈ సినిమాను నిర్మాతలు కూడా ఫిక్స్ అయిపోయారు. లగడపాటి శ్రీధర్ తో కలిసి మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి డైరక్షన్లో ద్విభాషా చిత్రం చేయనున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది మార్చికి కంప్లీట్ చేసి, వక్కతం వంశీ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించాలని బన్నీ భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus