మహేష్ తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేయనున్న వంశీ

  • September 7, 2018 / 09:27 AM IST

వంశీ పైడిపల్లి, రామ్ చరణ్ కలయికలో వచ్చిన “ఎవడు” మంచి విజయాన్ని సాధించింది. చెర్రీ నటన ఇందులో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానున్నట్లు గతంలో అనేక సార్లు రూమర్లు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం సెట్ అయిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. “ఎవడు” చిత్రానికి పని చేసిన హరి అనే రచయిత ఓ ఆసక్తికర లైన్ ని పైడిపల్లికి, చరణ్ కి వినిపించాడట. ఆ లైన్ ఇద్దరికీ నచ్చింది. వెంటనే డెవలప్ చేయాలని చెర్రీ ఆర్డర్స్ కూడా వేసినట్లు సమాచారం.

స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ “‘అజర్ బైజాన్”లో షూటింగ్ జరుపుకుంటోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత చెర్రీ… రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఎన్టీఆర్ తో కలిసి చేయనున్న ఈ మూవీ షూటింగ్ ఏడాది పాటు సాగనుంది. అప్పటిలోపున వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి సినిమాని కంప్లీట్ చేసి.. చెర్రీ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసి ఉంచుతారు. 2020 చివర్లో వీరి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే ఆస్కారం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus