ఇమ్ము- వర్ష.. అసలు విషయం బయటపడినట్టేనా?

  • November 5, 2022 / 12:15 AM IST

బుల్లితెర పై ఇప్పటికీ రాజ్యమేలుతున్న ‘జబర్దస్త్’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పటిలా టీఆర్పీ విషయంలో దుమ్ము రేపడం లేదు కానీ.. ఇప్పటికీ టాప్ ఆర్డర్లోనే కొనసాగుతుంది. ఈ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్స్ ఉండేవారు కాదు. ఆ టైంలో రష్మీ- సుధీర్ ల గురించి మాత్రమే రకరకాల గాసిప్స్ వినిపించేవి.కానీ ఆ తర్వాత వారి రేంజ్లో కాకపోయినా ప్రేమ వార్తలతో పాపులర్ అయిన వారిలో ఇమ్ము- వర్ష లు ఒకరు.

వీళ్ళ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ… ఎక్కువ క్రేజ్ నే సంపాదించుకున్నారు. వేరే షోలలో కూడా ఈ జంట సందడి చేయడం మనం చూస్తూనే వస్తున్నాం. తమ మార్క్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది ఈ జంట. అయితే ఈ మధ్య వర్ష- ఇమ్ములు కలిసి కనిపించడం లేదు. వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి అని ఇన్సైడ్ టాక్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముంది అనే విషయంపై ఆరా తీయగా.. ఇమాన్యుల్ అసలు విషయాన్ని బయటపెట్టాడు.

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కొత్త ఎపిసోడ్ ప్రోమోలో … ‘నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని’ అంటూ బ్రేకప్ ఎమోషనల్ సాంగ్ పాడాడు ఇమ్ము. ఈ ఫెర్ఫామెన్స్ జరుగుతున్నంతసేపు కూడా వర్ష ఎమోషనల్ అయినట్లు కనిపించింది. కానీ బయటపడలేదు అనిపించింది. ఇక వర్ష స్టేజి పైకి వచ్చిన తర్వాత ‘ఏమైంది?’ అని జడ్జి ఇంద్రజ అడగ్గా.. ఆమె మౌనంగానే ఉండిపోయింది.

తర్వాత ‘అప్పటికి ఇప్పటికే మీ మధ్య ఏం మారలేదా?’ అని యాంకర్ రష్మీ అడగ్గా.. ‘అది ఎప్పటికీ మారదేమో అనిపించింది. అందుకే ఇలా..’ అంటూ ఎమోషనల్ గా స్పందించాడు ఇమ్ము. ఇది ప్రమోషన్ కోసం చేస్తున్నదా.. లేక ఇమ్ము -వర్ష నిజంగా ప్రేమించుకుంటున్నారా? ప్రస్తుతం వీరి మధ్య మాటలు లేవా? అనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!


‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus