Veera Simha Reddy: ఆ సీన్ కు బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ?

  • November 1, 2022 / 06:19 PM IST

బాలయ్య గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాతో మార్కెట్ ను మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఎన్నో హైలెట్ సీన్లు ఉండగా ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ లో యాక్షన్ సీన్ ఉంటుందని బాలయ్య శృతిహాసన్ పాత్రలకు సంబంధించి షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయని తెలుస్తోంది.

బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా గురించి స్పందిస్తూ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా ఆ అంచనాలను మించి ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని బాలయ్య వీరాభిమాని కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు. మైత్రీ నిర్మాతలకు వీరసింహారెడ్డి సినిమా ద్వారా రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో లాభాలు వస్తున్నాయని తెలుస్తోంది.

బాలయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని బాలయ్యకు ఎలాంటి సక్సెస్ ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో వీరసింహారెడ్డి రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాలయ్య గత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు బ్రేక్ అవుతాయి.బాలయ్య అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. తన పాత్ర స్పెషల్ గా ఉంటుందని శృతి హాసన్ చెబుతుండటం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus