ఏకంగా ముఖ్యమంత్రికే తన బాధను చెబుతున్న ‘బంగారం’ బ్యూటీ ..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ‘బంగారం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2006 లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇది పక్కన పెడితే … ఈ చిత్రంలో హీరోయిన్ అనలేము కానీ ప్రధాన పాత్ర పోషించిన మీరా చోప్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. బంగారం(పవన్ కళ్యాణ్) స్నేహితురాలు సంధ్య పాత్రలో మీరా నటించింది. తరువాత ఎం.ఎస్.రాజు కొడుకు హీరోగా వచ్చిన ‘వాన’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చినా ఆడలేదు. తరువాత ఈమెకు నితిన్ ‘మారో’ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ‘సత్యం శివం సుందరం’ పేరుతో రావాల్సిన ఈ చిత్రం లేట్ గా ‘మారో’ పేరుతో విడుదల చేసారు. అయినా ఆడలేదు అనుకోండి.. తరువాత ఈమె… ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన ‘గ్రీకు వీరుడు’ చిత్రంలో కూడా నటించింది. అది కూడా ప్లాప్ అయ్యింది.తెలుగులో వర్కౌట్ కాలేదు అని మిగిలిన భాషల్లో ట్రై చేసినా అక్కడ కూడా నటిగా రాణించలేక పోయింది.

దాంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఇటీవల ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైందట. వివరాల్లోకి వెళితే..డిల్లీలోని మీరా చోప్రా తండ్రి వాకింగ్ కోసం బయటకు వెళ్లారట. ఆ క్రమంలో కొందరు దుండగుల ఆయన్ని కత్తులతో బెదరించి… ఆయన ఖరీదైన మొబైల్‌ ఫోన్ ను దొంగిలించారని తెలిపింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ను ట్యాగ్ చేస్తూ మీరా చోప్రా తన ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది.వాళ్ళ పై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఆమె రిక్వెస్ట్ పై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం వారు వెంటనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus