Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

సినిమా సినిమాకు డిఫరెన్స్‌ కనిపించకపోతే అది కచ్చితంగా విజయ్‌ సేతుపతి ఫిల్మోగ్రఫీ కాదు అని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు హీరోగా కానీ, నటుడుగా కానీ, విలన్‌గా కానీ.. ఎలా చేసినా తన సినిమాల జోనర్లు, కథలు కచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటూ వచ్చాయి. ఇదెలా సాధ్యమవుతోంది? అందులో ఈ లెక్క ప్రకారం నటిస్తూ ఎలా వరుస సినిమాలు చేస్తున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. దీనికి విజయ్‌ సేతుపతినే క్లారిటీ ఇచ్చారు. ఒకేలాంటి సినిమా మరోసారి చేయాలంటే తనకు ఏమనిపిస్తోందో కాస్త హార్ష్‌గానే చెప్పారాయన.

Vijay Sethupathi

ఒక సినిమా సీక్వెల్‌ చేయడం, రీమేక్‌ చేయడం లాంటివి విజయ్‌ సేతుపతికి అస్సలు నచ్చవు. ఎందుకు అని అడిగితే.. అదేంటో నటనలో ఏదైనా రిపీట్‌ చేస్తే నాకు చనిపోయినట్లు అనిపిస్తుంది. అంటే రిపిటీషన్‌ను నటుడిగా చావులా చూస్తాను అని చెప్పారు విజయ్‌ సేతుపతి. అలా అని స్ట్రాటజీలు వాడి సినిమాలు ఓకే చేస్తున్నారు అనుకునేరు.. అలాంటి ఆలోచనలు ఏవీ లేవని చెప్పారు. జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయంలో మన కంట్రోల్‌ చాలా తక్కువగా ఉంటుంది అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు విజయ్‌. అందుకే పెద్దగా ప్రణాళికలు వేసుకోకుండా గో విత్‌ ఫ్లో అనేలా ముందుకు సాగుతాను అని చెప్పారు.

ఈ టాపిక్‌ అంతా ఎందుకు వచ్చింది అంటే.. మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి ఓ సినిమాలో నటిస్తున్నారు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా గతంలో వారిద్దరూ కలసి చేసి ‘చెక్క చివంత వానమ్‌’ సినిమాకు కొనసాగింపా అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడే విజయ్‌ పై విధంగా స్పందించారు. ఇక ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా సాయిపల్లవి నటిస్తుందని వార్తలొస్తున్నాయి. హిందీ, దక్షిణాదిలో వరుస అవకాశాల్ని అందుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఈ సినిమాకు ఓకే చెప్పిందని టాక్‌. విజయ్‌ – సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ ప్రేమకథని తెరకెక్కించేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus