Vijay: అక్కడ గుడి కట్టించి ఫిదా చేసిన విజయ్.. ఏం జరిగిందంటే?

  • April 11, 2024 / 12:37 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను (Vijay) ఫ్యాన్స్ ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పారితోషికం పరంగా కూడా టాప్ లో ఉన్న విజయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ కానున్నారు. రాజకీయాల కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలన్న విజయ్ నిర్ణయాన్ని సైతం ఫ్యాన్స్ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. తాజాగా విజయ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విజయ్ తల్లి శోభ కోరిక మేరకు చెన్నైలోని కొరట్టూర్ లో తన స్థలంలో సాయిబాబా గుడి కట్టించారని సమాచారం అందుతోంది.

గత కొంతకాలంగా విజయ్ తన తల్లీదండ్రులకు దూరంగా ఉన్నారు. అయితే తల్లి శోభ అంటే విజయ్ కు ఎంతో ఇష్టం కాగా శోభ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలని విజయ్ ను కోరడంతో విజయ్ తన సొంత డబ్బులను ఖర్చు చేసి ఈ ఆలయం నిర్మించారని సమాచారం అందుతోంది. విజయ్ తల్లి శోభకు దైవభక్తి ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో విజయ్ నటిస్తుండగా ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్ పారితోషికం ఏకంగా 250 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే సౌత్ లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో విజయ్ మాత్రమే అవుతారని నెటిజన్లు ఫీలవుతున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉండటంతో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ విషయంలో మేకర్స్ రాజీ పడటం లేదని తెలుస్తోంది.

విజయ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించి ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సమాచారం అందుతోంది. సాయిబాబా ఆలయంలో విజయ్ తాజాగా ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus