‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్

  • December 15, 2018 / 08:20 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డీ.వీ.వీ. ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, మొదటి పాటకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే . ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

ఇప్పటికే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పిల్లర్స్ జూ.ఎన్టీఆర్, రాజమౌళి రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో గెస్ట్ గా ‘కే.టీ.ర్’ కూడా హాజరు కాబోతున్నట్టు తాజా సమాచారం. స్వతహాగా మహేష్,చరణ్,జూ.ఎన్టీఆర్ లు స్నేహితులు కావడంతో ఈ వేడుకకు హారుకాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రాంచరణ్ ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ‘కే.టీ.ర్’ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus