Vindhya Vishaka: ఆ యాంకర్లపై ఫైర్ అయిన వింధ్య విశాఖ.. వాళ్ల గురించేనా?

  • April 24, 2024 / 08:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమ (Suma Kanakala) , ఝాన్సీ (Jhansi) , ఉదయభానులకు (Udaya Bhanu) ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ యాంకర్లు ఒక వెలుగు వెలగగా గతంతో పోల్చి చూస్తే ఈ యాంకర్లకు ఆఫర్లు అయితే తగ్గాయనే చెప్పాలి. యాంకర్ సుమ మాత్రం ఇతర యాంకర్లతో పోల్చి చూస్తే బెటర్ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈతరం యాంకర్లలో చాలామంది తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. తెలుగును ఖూనీ చేస్తూ మాట్లాడుతున్న కొంతమంది యాంకర్లు, నటులపై నెటిజన్లు సైతం చాలా సందర్భాల్లో ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే.

అలాంటి యాంకర్ల గురించి టాలీవుడ్ యాంకర్ వింధ్య విశాఖ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో తెలుగు కామెంటరీతో ఆమె పాపులారిటీని సంపాదించుకోవడం జరిగింది. సుమక్క అంటే చాలా ఇష్టమని ఆమెతో కొన్ని షోలు మాకు కూడా విడిచిపెట్టాలని సరదాగా చెబుతామని వింధ్య అన్నారు. సుమక్క టైమింగ్ సూపర్ అని వింధ్య విశాఖ పేర్కొన్నారు. ఉదయభాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ఆమె గ్లామర్, లుక్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారని వింద్య విశాఖ అన్నారు. ఝాన్సీ గారికి సమాజం విషయంలో అవగాహన ఉందని ఆమె తెలిపారు. ఝాన్సీతో కొంత సేపు మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చని వింద్య విశాఖ అన్నారు. మరి కొందరు యాంకర్లు ఉన్నారని తెలుగు సరిగ్గా మాట్లాడలేరని ఆమె తెలిపారు.

ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు యాంకరింగ్ ను భ్రష్టు పట్టిస్తున్నారని వింద్య విశాఖ వెల్లడించారు. కొన్ని షోలలో బూతులను, డబుల్ మీనింగ్ కామెడీని వాళ్లు జనాలకు అలవాటు చేస్తున్నారా అనిపిస్తుందని వింద్య విశాఖ పేర్కొన్నారు. ఒక షోలోని యాంకర్స్ గురించి వింధ్య రియాక్ట్ అయ్యారని నెటిజన్లు చెబుతున్నారు. వింద్య విశాఖను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus