మంచు మనోజ్ తో తలపడుతున్న నారా రోహిత్..!
- March 23, 2016 / 11:40 AM ISTByFilmy Focus
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గతేడాదే చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఎటాక్ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 1 న విడుదల అవుతోంది. సి. కళ్యాణ్ నిర్మాతగా, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ఇప్పటికే ఓ ప్రముఖ ఛానెల్ రూ.కోటికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ సరసన సురభి జంటగా నటించగా.. వడ్డే నవీన్, కోటా శ్రీనివాస రావు, జగపతి బాబు తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు.
మరోవైపు అదే రోజున నారా రోహిత్ నటించిన సావిత్రి విడుదల అవుతోంది. దీంతో వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద పోటీ ఏర్పడగా.. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది వేచిచూడాలి. కాగా సావిత్రి చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించగా.. నారా రోహిత్ సరసన నందిత జంటగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 25 నే విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల రిత్యా ఏప్రిల్ 1 కి వాయిదా పడింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












